భారతీయుల్లో పెరిగిపోతున్న సంతాన లోపం సమస్య..!

భారతీయుల్లో సంతాన లోపం సమస్య పెరిగిపోతుంది. ఇటీవల వెల్లడించిన గణంకాల ప్రకారం సంతాన లోపం ఉన్నవారి సంఖ్య భారతదేశంలో గణనీయంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది. దేశంలో సుమారు 27 కోట్ల మంది దంపతులు సంతానం పొందలేకపోతున్నారని తేలింది. వీరిలో సంతాన సాఫల్యత సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. 

సంతాన లోపంకు కారణాలు:

  • ప్రస్తుతం చాలా మంది యువత ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. 
  • కెరీర్ లో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకుందామని చాలా మంది ఆలోచిస్తున్నార. అందువల్లే వివహాలు ఆలస్యంగా జరుగుతున్నాయి. 
  • వివాహం ఆలస్యంగా జరిగితే వాటి ప్రభావం మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థపై పడుతోంది. ఈక్రమంలో మహిళల్లో 35 ఏళ్లు దాటాక సంతానం కలిగే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. 
  • ఇక పురుషుల్లో ఎక్కువగా కూర్చుని పనిచేసే ఉద్యోగాలు, కంప్యూటర్ల ముందు కూర్చోవాల్సి వస్తుంది. దీంతో వీర్యంలో నాణ్యత లోపిస్తోంది.
  • వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవడం లేదు. ఇది కూడా సంతాన లోపానికి కారణమవుతుంది. 
  • కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించడం సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతోంది. 
  • ఒత్తిడి, ఆందోళన, శారీరక శ్రమ లేకపోవడం, అస్తవ్యస్తమైన జీవన విధానం, అధిక బరువు, హార్మోన్ల సమస్యలు, శరీరంలోకి విష పదార్థాలు చేరడం వంటి కారణాల వల్ల చాలా మందికి సంతానం కలగడం లేదు. 

అయితే అన్ని విధాలుగా మార్పులు చేసుకోవడం, ఆరోగ్యవంతమైన జీవినశైలిని పాటించడం చేస్తే సంతానోత్పత్తి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో పిల్లలు పుట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

Leave a Comment