తొలి టీ20లో భారత్ విజయం..!

ఆసీస్ తో వన్డే సిరీస్ కోల్పోయిన భారత్ టీ20లో తన సత్తా చాటుతోంది. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ 20లో 11 పరుగుతల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్ సిరీస్ లో 0-1 తో ఆధిక్యంలోకి వెళ్లింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 51 పరుగులు, రవీంద్ర జడేజా 44 పరుగులతో రాణించారు. సంజూ శాంసన్ 23 పరుగులతో పర్యాలేదనిపించాడు.

162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 150 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ బ్యాట్స్ మెన్ లలో షార్ట్(34), ఫించ్(35) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే వన్డేలో రాణించిన స్మిత్ 12 పరుగులకే పెవిలియన్ దారి పట్టాడు. ఆ తర్వాత మ్యాక్స్ వెల్(2) నిరాశపరచగా, హెన్రిక్యూస్(30) పర్యాలేదనిపించాడు. భారత బౌలర్లో చాహల్, నటరాజన్ లు తలో మూడు వికెట్లు సాధించగా, దీపక్ చాహర్ కు వికెట్ లభించింది.   

Leave a Comment