భారత్ లో కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,392 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు 1,90,535 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 5,394 మంది కరోనాతో మరణించారు. అయితే దేశంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 91,819 మంది డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు 93 వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో 36వేల కరోనా కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కొత్తగా 76 కరోనా కేసులు..
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 76 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3118కి చేరింది. ఇప్పటి వరకు 64 మంది మరణించారు. కరోనా నుంచి కోలుకుని 2169 మంది డిశ్చార్జ్ అయ్యారు. 885 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.