రేపు ఢిల్లీకి సీఎం జగన్..అమిత్ షాతో భేటీ..

ఏపీ సీఎం జగన్ మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో ఈ పర్యటనపై ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టిన నివారణ చర్యలను, పెద్ద ఎత్తు నిర్వహించిన కరోనా పరీక్షల గురించి అమిత్ షాకు దృష్టికి తీసుకురానున్నారు. అంతే కాక లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో ఆయా అంశాలను ప్రస్తావించనున్నారు. వలస కూలీల తరలింపుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలను వీరు చర్చించనున్నారు. 

కాగా గత జనవరిలో అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానుల బిల్లులు, మండలి రద్దు తర్వాత జగన్ ఢిల్లీ వెళ్లారు. దాదాపు నాలుగు నెలల తర్వాత సీఎం జగన్ ఇప్పుడు ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఈ పర్యటనలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ను కూడా సీఎం జగన్ కలిసే అవకాశం ఉంది. 

Leave a Comment