అంతర్రాష్ట్ర కదలిక లపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకొనేంత వరకు షరతులు కొనసాగుతాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీ కి రావాలనుకునే ప్రయాణీకులు స్పందన పోర్టల్ ద్వారా ఈ పాస్ తీసుకోవాలన్నారు. కరోన ప్రభావం తక్కువ గా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు హోం క్వారెంటైన్ లో ఉండాలని సూచించారు.
కరోన ప్రభావం ఎక్కువ గా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు 7 రోజులు ఇన్స్టిట్యూషనల్ క్వారెంటైన్ లో ఉండాలని, కోవిడ్ -19 టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాలని చెప్పారు. పాజిటివ్ వస్తే కోవిడ్ హాస్పిటల్ కు, నెగటివ్ వస్తే మరో ఏడు రోజులు హోమ్ క్వారెంటైన్ లో ఉండాలని తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ఆంక్షలు కొనసాగుతాయని డీజీపీ స్పష్టం చేశారు.