ఏమాత్రం సత్తా తగ్గలేదు.. 35 బంతుల్లో 80 కొట్టిన వీరు..!

వీరెందర్ సెహ్వాగ్ లో సత్తా ఏ మాత్రం తగ్గలేదు. రోడ్ సెఫ్టీ సిరీస్ లో భాగంగా శుక్రవారం ఇండియా లెజెండ్స్, బంగ్లాదేశ్ లెజెండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో వీరు విధ్వంసం సృష్టించాడు. 35 బంతుల్లో 10 పోర్టు, 5 సిక్సర్లతో 85 పరుగులు చేశాడు. 110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్ వీరు విధ్వంసం దాటికి 10.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేధించింది. 

వీరేంద్ర సెహ్వాగ్ లో జతగా సచిన్ టెండూల్కర్ కూడా 33 పరుగులతో అతనికి సహకరించాడు. కాగా, మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ లెజెండ్స్ 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌట్ అయింది. 110 పరుగుల స్వల్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్ సెహ్వాగ్ మెరుపులతో 10.1 ఓవర్లలోనే 10 వికెట్ల తేడాతో గెలిచింది.  

Leave a Comment