ఘోరం.. 6 ఏళ్ల బాలికలను హత్య చేసిన 12 ఏళ్ల బాలుడు..!

6 ఏళ్ల బాలికలను 12 ఏళ్ల బాలుగు హత్య చేసిన దారుణ ఘటన చండీగఢ్ లోని హలోమజ్రాలో చోటుచేసుకుంది. ఆ బాలికలపై అత్యాచారం చేసిన తర్వాత మొహంపై రాయితో మోడీనట్లు పోలీస్ వర్గాలు అనుమానిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. 

వివరాలే మేరకు.. శుక్రవారం సాయంత్రం నుంచి 6 ఏళ్ల బాలిక కనిపించకుండా పోయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఆచూకి కోసం గాలిస్తుండగా హలోమజ్రా లైట్ పాయింట్ దగ్గర చెట్ల ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 

ఈ కేసులో సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా 12 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ ఫుటేజ్ లో బాలుడు బాధిత బాలికతో కలిసి సైకిల్ పై వెళ్తున్న చిత్రాలు రికార్డయ్యాయి. వీటి ఆధారంగా బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందుతుడిని ఆదివారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపెట్టనున్నారు. 

కాగా, ఈ ఘటనతో హలోమజ్రా గ్రామం ఉద్రిక్తంగా మారింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. గ్రామస్తులంతా చండీగఢ్-అంబాలా రహదారిపై నిరసనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. 

  

 

Leave a Comment