రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ గెలిచిన ఇండియా లెజెండ్స్..!

రిటైర్డ్ క్రికెటర్లతో నిర్వహించిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో మన ముసలోళ్లు అదరగొట్టారు. రోడ్ సెఫ్టీ వరల్డ్ టీ 20 సిరీస్ ఛాంపియన్ గా ఇండియా లెజెండ్స్ నిలిచింది. శ్రీలంక లెజెండ్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. యూవరాజ్ సింగ్(41 బంతుల్లో 60,4 సిక్సర్లు, 4 ఫోర్లు), యూసుఫ్ పఠాన్(36 బంతుల్లో 62 నాటౌట్, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది. సెహ్వాగ్ 10, కెప్టెన్ సచిన్ టెండూల్కర్ 30 పరుగులు చేశారు. 

అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక లెజెండ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి ఓడింది. కెప్టెన్ దిల్షాన్(18 బంతుల్లో 21), జయసూర్య(43) తొలి వికెట్ కు 62 పరుగులు చేశారు. అయితే వీరిద్దరు అవుటయ్యాక మిగితా బ్యాట్స్ మెన్ సరిగ్గా రాణించలేకపోయారు. చివర్లో జయసింఘే(30 బంతుల్లో 40), వీరరత్నె(15 బంతుల్లో 38) పరుగులు ఫలితం లేకపోయింది. 

 

Leave a Comment