ఇద్దర్నే ఎందుకు..20 మంది పిల్లలను కనండి : ఉత్తరాఖండ్ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు..

గత కొన్ని రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ విమర్శల పాలవుతున్నారు ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్.. ఇటీవల ‘రిప్డ్ జీన్స్’ అంటూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మహిళలు తమదైన శైలిలో స్పందించారు. చిరిగిన జీన్స్ ధరించి నిరసన తెలిపారు. అమెరికా, భారతదేశాన్ని 200 సంవత్సారలు పాలించిందంటూ మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆయన విమర్శల పాలయ్యారు. 

తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పేద కుటుంబాలకు రేషన్ పంపిణీ చేసే కేేంద్ర ప్రభుత్వ పథకం నుంచి ఎక్కువ లబ్ధి పొందాలంటే 20 మంది పిల్లల్ని కనాలని సీఎం సూచించారు. అంతే కాదు ఇద్దరు పిల్లలున్న మీరెందుకు అసూయపడతారని, 20 మందిని ఎందుకు కనలేదంటూ వ్యాఖ్యానించారు. అటవీ దినోత్సవం సందర్భంగా రామ్ నగర్ లో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి.  

Leave a Comment