‘ప్రజలు ఒప్పుకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. చంద్రబాబు సవాల్..!

మూడు రాజధానులకు ప్రజలు ఓటేస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. రాజధాని అమరావతి ఉద్యమం ప్రారంభమై నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా రాయపూడిలో ‘అమరావతి జనభేరి’ పేరిట బహిరంగ సభ నిర్వహించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ రాజధానిలో అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ నేతలు ఆరోపించారని, అధికారంలోకి వచ్చి 18 నెలల్లో ఏంచేశారని ప్రశ్నించారు.  మూడు రాజధానులపై రెఫరెండానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఒక్క అవకాశం అంటూ ప్రజలను మోసం చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులంటూ ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు. 

బాంబులకే తాను భయపడలేదని, వీరి తాటాకు చప్పుళ్లకు భయపడనని అన్నారు. ఇప్పుడు పోరాడకపోతే భవిష్యత్తులో బానిసలుగా మిగిలిపోతారన్నారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని ప్రజలంతా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అధికారం తనకేం కొత్త కాదని, ఇప్పుడు అధికారం కోసం ఇలా చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.  

Leave a Comment