‘అమ్మను జీవితంలో క్షమించను’ అంటూ సూసైడ్ నోట్.. !

ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో భర్త సాయి ప్రణీత్ మృతి చెందాడు. భార్య విజయ పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరిలో చోటుచేసుకుంది. వివరాల మేరకే కోటగిరి మండలం పోచారం కాలనీకి చెందిన సాయి ప్రణీత్, విజయ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.

అయితే వీరి పెళ్లికి ప్రణీత్ తల్లిదండ్రులు అంగీకరించలేదు. విజయ తల్లి సావిత్ర వీరిద్దరికీ నెలరోజుల క్రితం ఓ గుడిలో పెళ్లి చేసింది. పెళ్లి చేసుకుని ఇద్దరు అమ్మాయి తల్లి ఇంట్లోనే ఉన్నారు. అప్పటి నుంచి కూతురిని, అల్లుడిని వేధించడం మొదలుపెట్టింది. దీంతో అబ్బాయి తల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకెళ్లారు. 

అయితే సావిత్ర మాత్రం అక్కడ కూడా వారిని వదల్లేదు. ప్రణీత్ ఇంటికి వచ్చి గొడవ చేసేది. దీంతో మనస్తాపానికి గురై ఇద్దరూ పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న జంటను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సాయి ప్రణీత్ మరణించాడు. విజయ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

కాగా ఘటన స్థలంలో విజయ రాసిన సూసైడ్ నోట్ దొరికింది. ఆ నోట్ లో ఏంరాసిందంటే.. ‘అమ్మ పెట్టే బాధలు భరించలేకే చావడానికి సిద్ధపడుతున్నా. పెళ్లి అయినప్పటి నుంచి అమ్మ వేధింపులకు గురిచేస్తోంది. నాతోపాటు నా భర్తను కూడా ఇబ్బందులు పెడుతోంది. మా అత్తమామలపై కూడా కేసు పెడతామని బెరిస్తున్నారు. నన్ను కొడుతున్నారు. మా చావుకు కారణమైన అమ్మను జీవితంలో క్షమించను. ఎప్పుడూ ద్వేషిస్తునే ఉంటాను. ఇంకో జన్మంటూ ఉంటే నీ కూతురిగా పుట్టొద్దని దేవుడిని కోరుకుంటున్నా’. అని ఉంది.     

 

Leave a Comment