చంద్రబాబు ఉంటేనే వచ్చే ఎన్నికల్లో జగన్ కు 170 సీట్లు వస్తాయ్ : కొడాలి నాని

చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి పార్టీని కాజేసిన చిల్లర దొంగ అని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయలంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును ప్రజలు ఎప్పుడో రాజకీయంగా సమాధి చేశారని, ఆయన బతుకు కుక్క కంటే హీనం అని వ్యాఖ్యానించారు. 

లోకేష్ ను మంగళగిరిలో పాతాళానికి తొక్కామని, వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు కూడా ఇదే గతి పడుతుందని కొడాలి నాని పేర్కొన్నారు. ఏం పీకావ్ అని జగన్ ను చంద్రబాబు అడుగుతున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన అందరి పేర్లు బయట పెట్టామన్నారు. 

చంద్రబాబు ఎట్టి పరిస్థిల్లోనూ రాజకీయాల నుంచి వెళ్లకూడదని, చంద్రబాబు ఉంటేనే వచ్చే ఎన్నికల్లో జగన్ కు 170 సీట్లు వస్తాయని కొడాలని నాని వ్యాఖ్యానించారు. 74 ఏళ్లు పూర్తి కాగానే చంద్రబాబుకు కూడా ఎన్టీఆర్ కు క్షోభ పెట్టిన గతే చంద్రబాబుకు పడుతుందన్నారు. చంద్రబాబు పిచ్చి కుక్కలా మొరుగుతున్నాడని పేర్కొన్నారు. 

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి అయినా పట్టు వస్త్రాలు సమర్పించారా అని ప్రశ్నించారు. ఇవాళ తన బినామీలు రోడ్డున పడగానే అమ్మవారు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నలు వేశారు. తన కుట్రలు చూసే అమ్మవారు ఆయనకు ఈ స్థితి కల్పించిందని కొడాలి నాని వెల్లడించారు. 

 

Leave a Comment