పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా ఐఏఎస్ అమ్రపాలి..!

తెలంగాణ ఐఏఎస్ అధికారిణి అమ్రపాలికి కీలక పదవి దక్కింది. ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయంలో డిప్యూటీ కార్యదర్శిగా నియమిస్తూ పీఎంవో ఆదేశాలు జారీ చేసింది. 2023 అక్టోబర్ 27 వరకు ఆమె విధులు నిర్వర్తిస్తారు. అమ్రపాలితో పాటు మధ్యప్రదేశ్ కేడర్ కు చెందిన రఘురాజ్  రాజేంద్రన్ డైరెక్టర్ గా, ఉత్తరాఖండ్ కేడర్ కు చెందిన మంగేష్ గిదియాల్ ను జూనియర్ సెక్రటరీగా నియమించింది. 

అమ్రపాలి 2010 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడెర్ కు చెందిన వారు. గతంలో ఆమె వికారాబాద్ సబ్ కలెక్టర్ గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్ జిల్లా కలెక్టర్ గా, రాష్ట్ర ఎన్నికలక సంఘంలో అధికారిణిగా సేవలందించారు.  ప్రస్తుతం ఈమె కేబినెట్ సెక్రటేరియేట్ లో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు.  

Leave a Comment