కమెడియన్ గా అలరిస్తున్న రాహుల్ రామకృష్ణ సినిమాలకు గుడ్ బై చెప్పాడు. ఇకపై తాను సినిమాల్లో నటించనని ప్రకటించాడు. 2022 వరకు మాత్రమే సినిమాల్లో నటిస్తానని, ఆ తర్వాత సినిమాలకు దూరం అవుతానని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని రాహుల్ రామకృష్ణ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు..
ఎవరేమనుకున్నా తన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని రాహుల్ రామకృష్ణ స్పష్టం చేశాడు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. కాగా.. రాహుల్ రామకృష్ణ ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’, ‘గీతా గోవిందం’, ‘జాతి రత్నాలు’, ‘కల్కి’, ‘స్కైలాబ్’ సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.
అయితే రాహుల్ రామకృష్ణ ఉన్నట్టుండి సినిమాలకు గుడ్ బై చెప్పడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో పలు రకాలుగా స్పందిస్తున్నారు. ప్రాంక్ చేస్తున్నావు కదూ.. ఇదంతా వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసమే కదా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.. అయితే రాహుల్ రామకృష్ణ అనూహ్యంగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నడో తెలియాల్సి ఉంది…
2022 is my last.
I will not do films anymore.
Not that I care, nor should anybody care— Rahul Ramakrishna (@eyrahul) February 4, 2022