భర్త మూత్ర విసర్జన చేసి నీళ్లు పోయలేదని.. భార్య ఆత్మహత్య..!

ఈరోజుల్లో చిన్నచిన్న సమస్యలను పెద్దగా చేసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.. చిన్నపాటి గొడవలు వస్తే సర్దుకుపోవాల్సిన భార్యాభర్తలు.. ప్రాణాలు తీసుకుంటున్నారు.. తాజాగా బాత్ రూం క్లీనింగ్ విషయంలో మొదలైన గొడవ సూసైడ్ చేసుకునే వరకు వచ్చింది. భర్తతో గొడవ పడిన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లోని మూసాపేటలో వెలుగు చూసింది. 

పోలీసుల వివరాల ప్రకారం.. దాసరి శ్రుతి, నవీన్ ఇద్దరూ భార్యాభర్తలు.. కూకట్ పల్లి న్యూబాలాజీ నగర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒకరికి ఆరేళ్లు.. మరో ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారు. నవీన్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య శ్రుతి ఇంట్లోనే ఉంటుంది. 

మంగళవారం మధ్యాహ్నం భర్త నవీన్ బాత్ రూమ్ లో మూత్ర విసర్జన చేసి వచ్చాడు. అయితే బాత్ రూమ్ లో నీళ్లు పోయలేదు. కంపు రావడంతో నీళ్లు ఎందుకు పోయలేదని భార్య నిలదీసింది. ఇద్దరి మధ్య మాటమాట పెరిగి.. వివాదం పెద్దగా మారింది. అవమానంగా భావించిన భార్య.. క్షణికావేశంలో పైగదిలోకి వెళ్లి ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Leave a Comment