ప్రియురాలితో భర్త కాపురం.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య..!

వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. ఎన్నో కుటుంబాలు బలవుతున్నాయి. తాజాగా ఓ భర్త తన భార్యను వదిలి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య రెడ్ హ్యాండెడ్ గా భర్తను, అతడి ప్రియురాలిని పట్టుకొని చితక బాదింది. ఈ ఘటన కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో చోటుచేసుకుంది. 

వివరాల మేరకు గుంటూరు జిల్లా పెద్దపరిమికి చెందిన ప్రకాశ్ కు 2019లో అదే జిల్లాకు చెందిన త్రివేణితో పెళ్లి జరిగింది. పెళ్లికి కట్నంగా రూ.20 లక్షలు, 30 సవర్ల బంగారు ఆభరణాలు, 3 ఎకరాల భూమి ఇచ్చారు. ప్రకాశ్ బంజారాహిల్స్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో చార్టర్డ్ అకౌంటెంట్ గా పనిచేస్తాడు. దీంతో భార్యతో హైదరాబాద్ లో కాపురం పెట్టాడు. పెళ్లయిన నెల నుంచి భార్యను దూరం పెడుతూ వచ్చాడు. రాత్రికి ఇంటికి వచ్చేవాడు కాదు. అంతేకాదు భార్య ప్రైవేట్ ఫొటోలను స్నేహితులకు చూపించేవాడు.

భర్త ఇన్ని బాధలు పెడుతున్నా మౌనంగా భరిస్తూ వచ్చింది త్రివేణి.. చివరికి తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయాన్ని తెలుసుకుని ఎలాగైన బుద్ధి చెప్పాలనుకుంది. ఈక్రమంలో బుధవారం రాత్రి త్రివేణి తన కుటుంబ సభ్యులతో కే.పీ.హెచ్.బీ తులసీనగర్ లో ప్రకాశ్, మరో మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టకుంది. భర్త వేరే మహిళతో ఉండటాన్ని తట్టుకోలేకపోయింది. కోపంతో భర్తను చితకబాదింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రకాశ్ ని, అతని ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నారు. 

 

Leave a Comment