ఆలయానికి రక్షణగా ముస్లింల మానవ హారం..

ఒక ఫేస్ బుక్ పోస్టు బెంగళూరులో విధ్వంసానికి దారితీసింది. మంగళవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటి దుండగులు నిప్పంటించారు. ఆ వివాదాస్పద పోస్టు పెట్టిన నవీన్  ఎమ్మెల్యే బంధువు కావడంతో ఈ వివాదానికి కారణమైంది. ఆ ప్రాంతంలో 200 కు పైగా వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, 60 మంది పోలీసులకు గాయాలయ్యాయి.  ఈ ఘటనలో 110 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 

ఇదిలా ఉండగా…ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది..డీజే హళ్లీలో ఒక ఆలయం ఉంది. దుండగుల్లో కొందరు విధ్వంసం సృష్టిస్తూ ఆలయం వైపు వస్తుండగా….మరో వైపు ఆ ఆలయాన్ని దండగుల నుంచి కాపాడేందుకు మరికొందరు ముస్లింలు ఒకరి చేతులు మరొకరు పట్టుకుంటూ గుడి చుట్టూ మానవ హారం చేపట్టారు. హిందూ-ముస్లంలు కలిసి ఉండాలనే సందేశాలన్ని ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Leave a Comment