సెప్టెంబర్‌ 20 నుంచి ‘సచివాలయ’ పరీక్షలు

రాష్ట్రంలో సెప్టెంబర్‌ 20 నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ… వారం రోజుల పాటు పరీక్షల నిర్వహణ ఉంటుందన్నారు. పది లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని అంచనా వేసినట్లు చెప్పారు. తొలిరోజే 4.5 లక్షల మంది వరకు పరీక్షలు రాస్తారని పేర్కొన్నారు. అత్యంత పారదర్శకంగా పరీక్షల నిర్వహణ ఉండాలని అధికారులకు మంత్రులు సూచించారు. అదేవిధంగా రాష్ట్రంలో ఖాళీలు ఉన్న పశుసంవర్థక అసిస్టెంట్‌ పోస్టుల భర్తీపై దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు.

 

Leave a Comment