చిన్న పిల్లల్లో కరోనా లక్షణాలు.. గుర్తు పట్టడం ఎలా?

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మొదటి దశతో పోల్చుకుంటే రెండో దశలో కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దేశంలో థర్డ్ వేవ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయయని, ఈ దశలో చిన్న పిల్లలు వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపునులు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 

లక్షణాలు గుర్తు పట్టడం ఎలా?

  • పెద్దల్లో అయితే దగ్గు, జలుబు, ఆయాసం కొన్సి సందర్భాల్లో గుండె పోటు, పక్షపాతం వంటి లక్షనాలు ఉంటాయి. పిల్లల్లో అయితే ఎక్కువగా వాంతులు, విరేచనాలు, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు కనిపిస్తాయి.
  • పిల్లల్లో వాంతులు, విరేచనాలు, జ్వరం దగ్గు, జలుబు, కడుపునొప్పి మూడు రోజుల కంటే ఎక్కువ ఉన్నప్పుడు, ఆక్సిజన్ స్థాయి 94 కంటే తక్కువగా ఉన్నప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి. 
  • కళ్లు ఎర్రగా మారడం, ఒళ్లంతా దద్దుర్లు, దగ్గు తగ్గకపోవడం, రోజంతా వాంతులు, నీరసంగా ఉండటం, పాలు సరిగా తాగకపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.
  • ఇక పిల్లల్లో లక్షణాలు ఉండి పరీక్షల్లో నెగిటివ్ ఉంటే రక్త పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. సీబీపీ, సీఆర్పీలో ఏమైనా తేడాలు ఉంటే, వైరస్ వస్తే మనకు తెలిసిపోతుంది.  

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • కరోనా సోకకుండా ఉండాలంటే ఇంట్లోనే ఉండి అవసరమైనప్పుడు మాత్రమే బయటకు వెళ్లాలి.
  •  పిల్లలను ఇంకా కొన్ని రోజుల వరకు ముఖ్యంగా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చేదాకా బయట తిరగనీయకూడదు. బయటికి వెళ్తే మాస్కులు తప్పకుండా పెట్టాలి.
  •  చేతులను శుభ్రంగా శానిటైజ్ చేసుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించే విధంగా చూడాలి..

Leave a Comment