రూ.10 స్టాంప్ పేపర్ పై ఇళ్ల పట్టా..

ఐదేళ్ల తరువాత క్రయవిక్రయాలకు అవకాశం

తహసీల్దార్లతో ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్

రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఏర్పట్లు జరుగుతున్నాయి. 25 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేష్ పై అధికారులు కసరత్తు చేస్తున్నారు. భూములను సేకరించి చదును చేయడం, ప్లాటింగ్, మార్కింగ్ జరుగుతోంది. లబ్ధిదారుల పేరిట ప్రభుత్వం రూ.10 స్టాంప్ పేపర్ పై ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి అందించనుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రెవెన్యూ శాఖ జిల్లా అధికార యంత్రాంగానికి పంపింది.

రిజిస్ట్రార్ కార్యాలయానికి డాక్యుమెంట్..

  • రూ.10 స్టాంపు పేపర్ తొలి పేజీలో లబ్ధిదారుడి సమాచారంతో పాటు తహసీల్దార్ సంతకం ఉంటుంది.
  • రెండో పేజీలో ఇంటి స్థలం, సరిహద్దు వివరాలు, తహసీల్దారు సంతకం ఉంటుంది. 
  • మూడో పేజీలో (ఫారం 32-ఏ)లో తొలుత తహసీల్దార్ / ప్రతినిధి ఎడమ చేతి బొటన వేలి ముద్ర వేసి పాస్ పోర్టు ఫొటో అతికించి సంకతం చేసి చిరునామా పూరిస్తారు. తరువాత లబ్ధిదారులు / ఆమె ప్రతినిధి ఎడమ చేతి బొటన వేలు ముద్ర వేసి పాస్ పోర్టు ఫొటో అతికించి సంతకం చేసి చిరానామా పూరిస్తారు. స్టాంప్ పేపర్ పై సాక్షి, తహసీల్దార్ సంతకాలు చేస్తారు. 
  • డాక్యుమెంట్ మూడు పేజీలను స్కానింగ్ చేసి రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపిస్తారు.  లబ్ధిదారులు పేరిట తహసీల్దారులే రిజిస్ట్రేషన్ చేయిస్తారు. 

స్టాంప్ ఎలా ఉంటుంది ?

  • రూ.10 స్టాంప్ పేపర్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రెవెన్యూ శాఖ ఇంటి స్థలం పట్టా అని ఉంటుంది. 
  • లబ్ధిదారులు ఇంటి స్థలాన్ని వంశపారంపర్యంగా అనుభవించవచ్చు. అవసరాల నిమిత్తం ఇంటి స్థలాన్ని బ్యాంకులో ఎప్పుడైనా తనఖా పెట్టుకోవచ్చని పట్టాలో పేర్కొన్నారు. 
  • అవసరమైతే ఐదేళ్ల తరువాత ఇంటి స్థలాన్ని విక్రయించుకోవచ్చు. కొనుగోలు చేయవచ్చు. మంజూరు చేసిన స్థలంలో అమలులో ఉన్న చట్టాలకు లోబడి నివాస కట్టడాలు చేపట్టవచ్చు. 
  • నవరత్నాల పథకాల వివరాలతో పాటు వైఎస్సార్, ముఖ్యమంత్రి జగన్ ఫొటోతో కూడిన లోగోను ఇంటి స్థలం పట్టాపై ముద్రించారు. 

Leave a Comment