1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు..!

రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏపీలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో సీఎం జగన్ మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రభుత్వ నిర్ణయాలను వెల్లడించారు. 

ప్రభుత్వ నిర్ణయాలు..

  • ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రస్తుతానికి యథాతథంగా జరుగుతాయి.
  • ఇంటర్ ప్రాక్టికల్స్ ఈనెల 24కి పూర్తవుతాయి. ఆపై థియరీ పరీక్షలు మే 5 నుంచి 23 వరకు షెడ్యూల ప్రకారమే జరుగుతాయి. 
  • 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం పూర్తయింది. రేపటి నుంచి సెలవులు..
  • కరోనా నిబంధనలు పాటిస్తూనే టెన్త్, ఇంటర్ పరీక్షలు జరుపుతాము..

Leave a Comment