ఏటీఎంలో హైటెక్ దోపిడీ..రూ.42.39 చోరీ..

గుర్ గ్రాంలోని ఒక ఏటీెఎంలో హైటెక్ చోరీ జరిగింది. హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్లు ఇద్దరు ముసుగు దొంగలు రూ.42.39 లక్షలను కొట్టేశారు. మే 23న సుశాంత్ లోక్ ప్రాంతంలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో ఈ దోపిడి జరిగింది. అయితే ఈ ముసుగు దొంగలను పోలీసులు ఇంత వరకు గుర్తించలేదు. 

ఈ ఏటీఎంలో మే 20న రూ.28 లక్షల నగదు నింపారని, మూడు రోజుల తర్వాత సాంకేతిక సమస్యలతో మెషిన్ పనిచేయడం లేదని ఫిర్యదా రావడంతో నగదు నిర్వహణ సంస్థ సిబ్బంది తనిఖీ చేసింది. దీంతో ఈ దోపిడీ గురించి గుట్టు రట్టయింది. 

ఏటీఎం నుంచి రూ.42.39 లక్షలు చోరీ అయ్యాయని గుర్తించినట్లు కంపెనీ ప్రతినిధి గిరీష్ పాల్ సింగ్ తెలిపారు. ఏటీఎంలోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా మే 23 రాత్రి 2.30 గంటల సమయంలో ముసుగులు ధరంచిన ఇద్దరు వ్యక్తులు ఏటీఎం కియోస్క్ కు చేరుకుని కెమెరా లెన్స్ ను తొలగించారు. అయితే  నిందితులు ఏటీఎంను గ్యాస్ కట్టర్ ఉపయోగించి తెరవలేదని, హ్యాకింగ్ పరికరం ద్వారా నగదును దొంగలించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇంటి దొంగల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.  

Leave a Comment