కరోనాపై హీరో విజయ్ ప్రచారం..

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని ప్రభావం రోజురోజుకు పెరిగిపోతుంది.దీంతో తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ పై అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగా సినీ హీరో, విజయ్ దేవరకొండతో కరోనాపై ప్రచార చిత్రాన్ని రూపొందించారు.

గత కొన్ని రోజులుగా స్నేహితులు, సన్నిహితులు కలిసినప్పుడు షేక్ హ్యాండ్ కు బదులు నమస్కారం పెట్టాలని, అలానే పదేపదే ముక్కు, కళ్లను చేతులతో ముట్టుకునే ప్రయత్నం చేయకుండా చూసుకోవాలని ప్రచారం చేస్తున్నారు. ప్రతి గంటకు ఒకమారు చేతులు శభ్రంగా కడుక్కోవాలని, ఇలా చేయడం ద్వారా కరోనా వైరస్ నుంచి కొంత వరకు బయటపడే అవకాశం ఉంటుందంని ప్రభుత్వం చెబుతుంది. విజయ్ తో రూపొందించిన ఈ ప్రచార చిత్రాన్ని కరోనా ప్రచార చిత్రంగా వినియోగించబోతున్నారు. 

Leave a Comment