ఐదుగురు ఎన్నికల పరిశీలకులను మార్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకుల్లో ఐదుగురిని మార్చేసింది. 13 జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా నియమించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. నలుగురు ఉన్నతాధికారులను రిజర్వ్లో ఉంచింది. శ్రీకాకుళం – బి.రామారావు, విజయనగరం – పీఏ శోభా, విశాఖ – ప్రవీణ్ కుమార్, తూర్పుగోదావరి – అరుణ్కుమార్, పశ్చిమగోదావరి – హిమాన్షు శుక్లా, కృష్ణా – శ్రీకేష్ బాలాజీరావు, గుంటూరు – కాంతిలాల్ దండే, ప్రకాశం – వివేక్ యాదవ్, నెల్లూరు – పి.బసంత్ కుమార్, చిత్తూరు – సిద్ధార్థజైన్, అనంతపురం – కె.హర్షవర్థన్, కర్నూలు – టి.బాబూరావునాయుడు, వైఎస్సార్ కడప పి.రంజిత్ బాషా నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.