సూర్య నటించిన నిర్మించిన ‘జై భీమ్’ సినిమా ఎంత భారీ హిట్ అయిందో అందరికీ తెలిసిందే.. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతమంటూ మెచ్చుకుంటున్నారు.. ఓటీటీలో విడుదలై రికార్డు స్థాయి వ్యూస్ ని సంపాదించి సెన్సేషన్ క్రియేట్ చేసింది ‘జై భీమ్’.. విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంది.. ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు నెలకొల్పుతోంది. ఐఎండీబీలో 9.6 రేటింగ్ సాధించి ప్రపంచ స్థాయి రికార్డును సృష్టించింది.
ఈ సినిమాలో హీరో సూర్య తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సిన మరో పాత్ర సినతల్లి.. ఈ సినిమాను పార్వతి అమ్మాళ్, రాజకన్ను అనే వ్యక్తుల జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. పోలీస్ కస్టడీలో చంపబడిన తన భర్త రాజకన్నుకు న్యాయం చేయాలని భార్య పార్వతి న్యాయపోరాటం చేస్తుంది. పార్వతి అమ్మాళ్ పాత్రను సినతల్లిగా చూపించారు.. సినిమా చివరిలో సినతల్లికి ఇల్లు కట్టిస్తారు.. కానీ నిజజీవితంలో పార్వతి ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటుంది. దీంతో పార్వతి అమ్మళ్ కు సహాయం చేయాలని చిత్ర నిర్మాణ సంస్థను మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్ అభ్యర్థించారు..
తాజాగా సూర్య ఈ విషయంపై స్పందించారు. పార్వతి అమ్మాళ్ కుటుంబానికి ఆయన ఆర్థికంగా అండగా నిలబడ్డారు. పార్వతి అమ్మాళ్ పేరిట రూ.10 లక్షల ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు సూర్య.. ఈ ఫిక్డ్స్ డిపాజిట్ మీద వడ్డీని ప్రతి నెలా పార్వతి అమ్మాళ్ కి అందజేస్తారు. ఆమె మరణాంతంర ఆ మొత్తాన్ని ఆమె పిల్లలకు అందజేస్తామని సూర్య చెప్పారు. ఈ విషయాన్ని సూర్య తన సొంత నిర్మాణ సంస్థ అయిన 2డీ ఎంటర్ టైన్మెంట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ సైతం ఈ రియల్ సినతల్లికి సొంతిల్లు కట్టిస్తామని ప్రకటించారు..
An FD of 10 lakhs from #Suriya sir for the benefit of Parvathy Ammal, the wife of Late Rajakannu. Wonderful gesture yet again👌#JaiBhim – the most impactful Indian film in recent times. It’s REAL! https://t.co/eoB4OQu6up
— Kaushik LM (@LMKMovieManiac) November 14, 2021