ముహూర్తం సమయానికి వధువు జంప్.. ప్రియుడితో పెళ్లి..!

ముహూర్తం సమయానికి హీరోయిన్ లేచిపోయిన హీరోతో పెళ్లి చేసుకోవడం ఎన్నో సిమాల్లో చూశాం.. తాళి కట్టే క్షణాల్లో పెళ్లి కొడుకుతో కాకుండా హీరోతో పెళ్లి జరుగుతుంది.. అచ్చం అలాంటి ఘటనే మదనపల్లెలో చోటుచేసుకుంది. సరిగ్గా తాళి కట్టాల్సిన సమయంలో దుస్తులు మార్చుకోవడానికి వెళ్లిన వధువు మాయమై తన ప్రియుడితో పెళ్లి చేసుకుంది. 

వివరాల మేరకు మదనపల్లె మండలం తట్టివారిపల్లెకు చెందిన సోనికకు పట్టణంలోని సొసైటీ కాలనీలో ఉంటున్న ఓ యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఆదివారం పెళ్లి జరిపించాలని పత్రిక రాయించాకున్నారు. పెళ్లికి ముందు శనివారం రాత్రి రిసెప్షన్ కూడా జరిగింది. ఆదివారమే పెళ్లి.. కల్యాణ మండపానికి వధూవరులతో పాటు బంధువులు, మిత్రులు అందరూ వచ్చారు. ఉదయం 5.30 గంటలకు ముహూర్తం ఉంది.. 

కాగా అదే సమయానికి వధువు సోనిక పెళ్లి చీర కట్టుకునేందుకు గదిలోకి వెళ్లింది. అయితే ఎంతసేపు అయినా తిరిగి రాలేదు. అనుమానం వచ్చి గది తలుపులు తెరిచి చూస్తే పెళ్లి కూతురు కనిపించలేదు. ఆదివారం ఉదయం గొల్లపల్లెకు చెందిన తన ప్రియుడు చరణ్ తో పుంగనూరుకు వెళ్లి ఓ గుడిలో పెళ్లి చేసుకుంది.. 

అంతేకాదు పెద్దలతో తమను ప్రాణహానీ ఉందని మదనపల్లె పోలీసులను ఆశ్రయించింది. అయితే పెళ్లి కొడుకు బంధువులు మాత్రం తమకు అవమానం జరిగిందని, పెళ్లి కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశామని పెద్దలతో కలిసి పోలీసులను ఆశ్రయించారు. కాగా తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, గృహనిర్బంధం చేస్తున్నారని సోనిక ఇదివరకే పోలీసులకు ఫిర్యాదు చేసింది..   

Leave a Comment