ఒకరికి తెలియకుండా మరొకరితో నాలుగు పెళ్లిళ్లు.. ఇప్పుడు మరో పెళ్లికి రెడీ అయిన కానిస్టేబుల్..!

ఒకరికి తెలియకుండా మరొకరితో పెళ్లి.. ఇలా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఐదుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. ఇప్పుడు మరో పెళ్లికి రెడీ అయ్యాడు.. అతడే సీసీఆర్బీ హెడ్ కానిస్టేబుల్ అప్పలరాజు.. మాయమాటలు చెప్పి మాసం చేస్తూ ఇప్పటికీ నలుగురిని పెళ్లి చేసుకున్న ఈ నిత్య పెళ్లికొడుకు ఆరాచకాలు విశాఖపట్నం పోలీస్ శాఖలో బట్టబయలయ్యాయి. దిశ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ అప్పలరాజుపై ఫిర్యాదు చేయడంతో ఈ నిత్య పెళ్లికొడుకు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

సీసీఆర్బీ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అప్పలరాజు మహిళలకు మాయమాలు చెప్పి పెళ్లి చేసుకుంటాడు. అలా ఒకరికి తెలియకుండా మరొకరితో ఇప్పటికీ నలుగురు మహిళలను పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఐదుగురు పిల్లలకు కూడా ఉన్నారు. వీరిలో పద్మ అనే మహిళకు నాలుగు సార్లు అబార్షన్ కూడా చేయించాడు. తాజాగా మరో మహిళ కానిస్టేబుల్ తో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీనిపై పద్మ కానిస్టేబుల్ అప్పలరాజును నిలదీసింది. నిత్య పెళ్లిళ్ల వ్యవహారంపై దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై మహిళ చేతన స్వచ్ఛంద సంస్థ స్పందించింది. మోసపోయిన మహిళలకు అండగా ఉంటామని మహిళ చేతన చైర్ పర్సన్ కత్తి పద్మ తెలిపారు. కానిస్టేబుల్ ను విధుల నుంచి తప్పించాలని, అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పద్మ డిమాండ్ చేశారు. 

Leave a Comment