Video Viral: పెళ్లి మండపంలో విషాదం.. గుండెపోటుతో వరుడు మృతి..!

పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన అతడి జీవితం ఆదిలోనే ముగిసింది.. రిసెష్పన్ వేదికపై కుప్పకూలి వరుడు మరణించాడు.. ఏం జరిగిందో చూసే సరికి అంతా అయిపోయింది. వివాహ రిసెప్షన్‌లో వరుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం విజయనగరం జిల్లా హోస్పేట్ తాలూకా పాపినాయకనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది.

 గ్రామానికి చెందిన హొన్నూర స్వామి(26)కి గ్రామంలోని ఆలయంలో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వరుడు రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నాడు. రిసెప్షన్ జరుగుతుండగా ఉన్నట్టుండి హొన్నూర స్వామికి ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

వైద్యులు పరీక్షించి వెంటనే హోస్ పేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కానీ అక్కడికి చేరుకోకముందే మార్గమధ్యంలో స్వామి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పెళ్లింట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. కొత్త జీవితం కోసం కలలు కన్న వధువు భర్తను కోల్పోవడంతో షాక్ కి గురైంది. 

 

 

Leave a Comment