భిక్షాటన చేసి రూ.50 లక్షలు దానం చేసిన బిచ్చగాడు..!

భిక్షాటన చేసిన సొమ్ము పది మందికి ఉపయోగపడాలని అనుకున్నాడు ఓ బిచ్చగాడు.. భిక్షాటన చేసిన సొమ్మును కూడబెట్టి సీఎం సహాయనిధికి అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.. అలా ఇప్పటి వరకు ఏకంగా రూ.50.60 లక్షలను పలు జిల్లాల కలెక్టర్లకు అందజేశాడు.. 

తమిళనాడు తూత్తుకుడిలోని అలంకినారు గ్రామానికి చెందిన పూల్ పాండియన్(72) భిక్షాటన చేసి జీవనం కొనసాగిస్తున్నాడు. అతడు ఇటీవల వేలూరు కలెక్టరేట్ లో జరుగుతున్న గ్రీవెన్స్ సెల్ కి వచ్చాడు. తన వద్ద ఉన్న రూ.10 వేలను సీఎం సహాయనిధికి ఇవ్వాలంటూ, శ్రీలంక తమిళులకు ఉపయోగపడేలా వాటిని ఖర్చు చేయాలని కోరుతూ కలెక్టర్ కుమరవేల్ పాండియన్ కి అందజేశాడు. 

అనంతరం పూల్ పాండియన్ మాట్లాడుతూ తాను 12 ఏళ్లుగా భిక్షాటన చేస్తున్నానని, దాని ద్వారా వచ్చిన డబ్బుతో ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, కుర్చీలు, టేబుళ్లు కొనుగోలు చేసి ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఇలా రూ.50.60 లక్షలు విలువ చేసే వస్తువులు, సొమ్మును విరాళంగా పలు సందర్భాల్లో అంజేసినట్లు తెలిపాడు.  

 

 

Leave a Comment