అయ్యో.. పెళ్లికి 3 గంటల ముందు వరుడు మృతి..!

మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మరో మూడు గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా వరుడు  మృతి చెందాడు. అతడు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. 

వివరాల మేరకు.. మహబూబ్ నగర్ పట్టణంలోని క్రిష్టియన్ పల్లికి చెందిన భువనాల చైతన్యకుమార్(35) నారాయణపేట జిల్లాలోని తిర్మలాపుర్ గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.చైతన్యకు ఇటీవల వనపర్తికి చెందిన అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. ఫిబ్రవరి 10న గురువారం ఉదయం 11 గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. 

పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతలో చైతన్య ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఉదయం 8 గంటలకు ఇంట్లో నుంచి కారులో బయలుదేరాడు. జడ్చర్ల వైపు వెళ్తుండగా నక్కలబండ సమీపంలో రోడ్డు మలుపు వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో చైత్యన తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లి కొద్ది గంటల ముందు ఉన్న ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. 

Leave a Comment