గ్రామ వాలంటీర్లకు గుడ్ న్యూస్..!

కోవిడ్-19పై జరుగుతున్న పోరాటంలో గ్రామీణ, పట్టణ స్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గ్రామ, వార్డు వాలంటీర్లకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీని వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం సర్కులర్ ను జారీ చేసింది. రాష్ట్రంలో 2 లక్షల 60వేల మంది గ్రామ, వార్డు వాలంటీర్లు ఉన్నారని, వీరంతా మూడు విడతలుగా కోవిడ్ -19 ఇంటింటి సర్వేలో భాగస్వాములయ్యారని పేర్కొంది. ఈ సర్వేలో భాగంగా కోవిడ్-19 పాజిటివ్ పేషెంట్లతో వీరు కాంటాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నందువల్ల గ్రామ, వార్డు వాలంటీర్లందరూ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద బీమా పొందవచ్చని చెప్పింది. 

Leave a Comment