చేప ఆకారంలో వింత శిశువు.. పుట్టిన కాసేపటికే మృతి..!

హైదరాబాద్ లోని పేట్లబురుజు ప్రభుత్వ ఆసుపత్రిలో వింత శిశువు జన్మించింది. చేప ఆకారంలో ఆ శిశువు పుట్టింది. అయితే పుట్టిన కొద్ది గంటల్లోనే ఆ శిశువు మృతి చెందింది. జన్యు లోపం కారణంగా ఇలా పుట్టిందంటూ వైద్యులు తెలిపారు. సంగారెడ్డికి చెందిన మహ్మద్ ఆరిఫ్, తహసీన్ సుల్తానా(20) భార్యాభర్తలు..

తహసీన్ సుల్తానా కు 9 నెలలు నిండటంతో ఈనెల 5న పేట్లబురుజు లోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేరింది.  ఈనెల 10న సాయంత్రం 7 గంటలకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో వైద్యులు ప్రసవం చేశారు. రెండు కాళ్లు అతుక్కుని చేప ఆకారంలో శిశువు జన్మించింది. 

వైద్యులు చికిత్స అందించేందుకు ప్రయత్నించారు. అయితే రాత్రి 10 గంటలకు ఆ శిశువు మృతి చెందింది. జన్యు లోపం కారణంగా ఇలా వింత ఆకారంలో శిశువు జన్మించింది అని వైద్యులు తెలిపారు. ఈ వింత శిశువు పుట్టిన విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది.  

 

Leave a Comment