సెల్ ఫోన్ ఇవ్వలేదని బాలిక ఆత్మహత్య..!

ఆన్ లైన్ క్లాసులకు సెల్ ఫోన్ ఇవ్వలేదని మనస్తాపంతో 15 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ఎన్టీపీసీ కృష్ణానగర్ కు చెందిన రజిత మొదటి భర్త కంకణాల సుధాకర్ 12 ఏళ్ల కింద చనిపోయాడు. దీంతో రజిత కుమార్తె సింధూజ(15)తో కలిసి జీవిస్తోంది. సింధూజ దివ్వాంగురాలు…కొన్నాళ్లకు రజిత సూరు రవికిరణ్ ను వివాహం చేసుకుంది. సింధూజ వారితోనే ఉంటోంది. 

ఇటీవల పాఠశాలలో 10వ తరగతి ఆన్ లైన్ క్లాసులు ప్రారంభమయ్యాయి. దీంతో సింధూజ మొబైల్ ఫోన్ లో ఆన్ లైన్ క్లాసులు వింటోంది. దీని కోసం తల్లి వద్ద ఉన్న ఫోన్ ను వాడుకుంటోంది. అయితే సింధూజ తనకు ప్రత్యేకంగా సెల్ ఫోన్ కావాలని పట్టబట్టింది. అడిగినప్పుడు తల్లి సెల్ ఫోన్ ఇవ్వడం లేదని దివ్యాంగురాలైన సింధూజ మానసికంగా కుంగిపోయింది. 

ఈక్రమంలో శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పుకు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి వచ్చి చూసేసరికి విగత జీవిగా పడి ఉంది. దీంతో తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  

 

Leave a Comment