వైన్ గ్లాస్, మొబైల్ ఫోన్ తో శివుడి జిఫ్.. ఇన్ స్టాగ్రామ్ పై కేసు..!

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ పై కేసు నమోదైంది. హిందువుల మనోభావాలను ఇన్ స్టాగ్రామ్ దెబ్బతీస్తోందని ఢిల్లీకి చెందిన బీజేపీ నేత మనీష్ సింగ్ ఫిర్యాదు చేశారు. జిఫ్ ఫార్మాట్ లో శివుడిని అనుచిత రీతిలో ఆ యాప్ చిత్రీకరించినట్లు ఆరోపించారు. ఒక చేతిలో మద్యం గ్లాసు, మరో చేతిలో మొబైల్ ఫోన్ తో ఉన్న శివుడి జిఫ్ ఇమేజ్ లను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. 

దీనిపై బీజేపీ నేత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇన్ స్టాగ్రామ్ సీఈవో, ఇతర అధికారులపై పార్లమెంట్ వీధిలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హిందువులు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారని, అలాంటి పరమేశ్వరుడిని గ్రాఫిక్ ఫార్మాట్ లో అభ్యంతరకర రీతిలో చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందువులను రెచ్చగొట్టి, విద్వేషాలు క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నట్లు పేర్కొన్నారు. శివుడిని అవమానరక రీతిలో చిత్రీకరించిన ఇన్ స్టా సీఈవోపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు.   

Leave a Comment