2022లో జమిలీ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి : చంద్రబాబు

2022లో జమిలీ(అసెంబ్లీ, లోక్ సభకు ఒకేసారి) ఎన్నికలు వస్తాయని, కార్యకర్తలంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలపునిచ్చారు. అమలాపురం పార్లమెంట్ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ తన పాలనలో ప్రజలకు నష్టాలు కలిగించారని ధ్వజమెత్తారు. పులివెందుల రాజ్యాంగాన్ని జగన్ అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఏపీలో దోపిడీ రాజ్యానికి శ్రీకారం చుట్టారని, భూ కుంభకోణాలు పెరిగాయని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దళితులపై దమనకాండకు పాల్పడుతోందని ఆరోపించారు. అమరావతిలో లక్ష కోట్ల సంపదను విధ్వంసం చేశారన్నారు. బీసీలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్ పెడితే, జగన్ కుట్రపూరితంగా బీసీల్లో చీలిక తెచ్చారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారికి భవిష్యత్తులో గుణపాఠం చెబుతామని చంద్రబాబు హెచ్చరించారు. 

 

Leave a Comment