సీఎం జగన్ ఇంట్లో విషాదం..!

ఏపీ సీఎం జగన్ ఇంట్లో విషాదం నెలకొంది. జగన్ మామ, వైఎస్ భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మరణించారు. ఆయన మృతదేహాన్ని పులివెందులకు తరలిస్తున్నారు. ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

ఈసీ గంగిరెడ్డి పులివెందులలో ప్రముఖ వైద్యులుగా గుర్తింపు పొందారు. ఈయనకు పేదల డాక్టర్ గా మంచి పేరు ఉంది. 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. శనివారం మధ్యాహ్నం ఆయన స్వగ్రామం వేముల మండలం గొల్లల గూడూరులో గంగిరెడ్డి అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది..

Leave a Comment