కార్మికులకు శుభవార్త..రూ.50 కోట్లతో గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ యోజన ప్రారంభం..

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుభవార్త అందించారు. వలస కార్మికులకు ఉద్యోగాలు కల్పించడానికి రూ.50 వేల కోట్లతో ‘గరీబ్ కళ్యాన్ రోజ్గార్ యోజన’ పథకాన్ని ప్రారంభించారు. శనివారం బీహార్ లోని ఖగారియా జిల్లాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభం చేశారు. 

ఈ పథకం బీహార్ రాష్ట్రంతో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఘండ్, ఒడిషా రాష్ట్రాలు ఎంపికయ్యాయి. భారతదేశంలోని 116 జిల్లాల్లో అమలు చేయనున్నారు. గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్ కింద సుమారు 25 పథకాలను తీసుకొచ్చారు. వచ్చే 125 రోజుల్లో వలస కార్మికులకు సొంత ఊర్లలో ఉపాధి చూపిస్తారు. ఈ పతకం ద్వారా 25 భిన్న రకాల పనులు చేసే వారికి ఉపాధి లభించనుంది. 

 

Leave a Comment