సైనిక లాంఛనలతో అమరవీరుల అంత్యక్రియలు..!

జమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడిలో వీరమరణం పొంది తెలుగు రాష్ట్రాలకు చెందిన జవాన్ల అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరిగాయి. తెలగాంణలోని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండం కోమన్ పల్లి వైకుంఠ ధామంలో వీర జవాన్ ర్యాడ మహేశ్ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో నిర్వహించారు. మహేశ్ పార్థివదేహంపై కుటుంబ సభ్యులు జాతీయ జెండాను ఉంచారు.  మహేశ్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల ఆశ్రునయానాలతో గ్రామ శివారులోని వైకుంఠధామం వరకు అంతిమయాత్ర జరిపారు. జవాన్ కు తుది వీడ్కోలు పలికేందుకు పెద్దఎత్తున జనం తరలివచ్చారు. 

 ఏపీలోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లికి చెందిన జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి భౌతిక కాయం రాత్రి 2 గంటలకు స్వగ్రామం చేరింది. మృతదేహం గ్రామంలోకి రాగాినే ప్రవీణ్ తల్లిదండ్రులు, భార్య పిల్లలతో పాటు బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఐరాలలో రాత్రి 2 గంటలకు ప్రవీణ్ అమర్ రహే అంటే నినాదాలు చేస్తూ గ్రామస్థులంతా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం ప్రవీణ్ కుమార్ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో నిర్వహించారు. 

Leave a Comment