పతీ సహగమనం.. భార్య చితిలోకి దూకిన భర్త..!

ఒడిశాలోని కలహండి జిల్లాలో పతీసహగమనం జరిగింది. చనిపోయిన భార్య చితిలోకి దూకాశాడు ఓ భర్త.. వివరాల మేరకే సియాల్ జోడి గ్రామానికి చెందిన రాయ్ బరి(60), నీలమణి సాబర్(65) భార్యభర్తలు.. మంగళవారం రాయ్ బరి మరణించింది. ఆమె దహన సంస్కారాలు నిర్వహించడానికి శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. 

దహన సంస్కారాలకు సంప్రదాయబద్ధంగా చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ నిర్వహించారు. మృతదేహానికి చెతి పేర్చి నిప్పంటించారు. తన భార్య మంటల్లో కాలిపోవడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు సాబర్.. అందరూ ఇంటికి తిరిగివెళ్తుండగా.. నీలమణి సాబర్ వెనక్కి వచ్చి ఒక్కసారిగా చితిలో దూకేశాడు. అందరూ చూస్తుండగానే కాలి బూడిద అయ్యాడు. దీనిని అసహజ మరణంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  

Leave a Comment