ఒకే కాన్పులో నలుగురు పిల్లలు..!

కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒకే కాన్పులో ఏకంగా నలుగురు శిశువులు జన్మించారు. శనివారం ఓ మహిళ నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ కాన్పు పట్ల కుటుంబ సభ్యులతో పాటు ఆస్పత్రి సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. 

కరీంనగర్ జిల్లాలోని నాగుల మాల్యలకు చెందిన నిఖిత నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. వీరిలో ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. తమకు నలుగురు పిల్లలు జన్మించడం చాలా సంతోషంగా ఉందని సాయి కిరణ్ నిఖిత దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

అంతేకాదు నాలుగు నెలల క్రితం ఇదే ఆస్పత్రిలో నిఖిత అక్క లిఖిత కూడా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇంకో విశేషం ఏంటంటే నిఖిత, లిఖిత కూడా కవల పిల్లలే. అక్కా చెల్లెళ్లు అయిన నిఖిత, లిఖితకు కవల పిల్లలు పుట్టడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

 

Leave a Comment