మాజీ సీఎం భార్య చెల్లెలు ఇప్పుడు భిక్షమెత్తుకుంటోంది..!

ఆమె ఓ మాజీ అథ్లెట్.. మాజీ టీచర్.. డాక్టరేట్ గ్రహీత.. ఇప్పుడు ఫుట్ పాత్ పై భిక్షమెత్తుకుంటోంది.. ఆమె ఎవరో కాదు పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య భార్య మీరా సోదరి ఇరా బసు.. బుద్ధదేవ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు చేశారు. అలాంటి నాయకుడి భార్య చెల్లెలు ఇప్పుడు దయనీయ స్థితిలో ఉంది. పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర 24 పరగణాల జిల్లా బరాబజార్ ప్రాంతంలోని దున్లాప్ లో ఆమె మాసిపోయిన గుడ్డలతో కనిపించింది. ఫుట్ పాత్ పైనే జీవనం గడుపుతోంది. 

ఇరా బసు వైరాలజీలో పీహెచ్ డీ చేసింది. రాష్ట్రస్తాయి టేబుల్ టెన్సీస్ క్రీడాకారిణి. క్రికెట్ లో కూడా రాష్ట్ర స్థాయిలో ఆడింది. 1976లో ప్రియానాథ్ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ జీవితం ప్రారంభించింది. ఆమె టీచర్ గా ఉన్నప్పుడు బావ బుద్ధవేవ్ సీఎంగా ఉన్నారు. 

Basu

ఇరా బసు 2009లో రిటైర్డ్ అయింది. తర్వాత ఏమైందో తెలీదు కానీ ఇప్పుడు దున్లాప్ లోని ఫుట్ పాత్ పై జీవనం సాగిస్తోంది.. అయితే రిటైర్డ్ అయిన తర్వాత ఆమె పింఛన్ కోసం కూడా దరఖాస్తు చేసుకోలేదని ప్రియానాథ్ పాఠశాల హెడ్ మిస్ట్రెస్ కృష్ణకాలి తెలిపారు. ఆమె పింఛన్ కు ఎందుకు దరఖాస్తు చేసుకోలేదో తెలియదన్నారు. 

అయితే సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం నాటు ఇరాబసును కొందరు స్థానిక సంఘాల నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా ఇరాబసు మాట్లాడారు. తనను ఎంతో మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు గుర్తు చేసుకుంటున్నారని, తనను ప్రేమిస్తున్నారని చెప్పింది. కొందరు తనను కౌగలించుకుని కన్నీళ్లు పెడతారని తెలిపింది. తాను టీచర్ గా ఉన్నప్పుడే తన బావ బుద్ధదేవ్ భట్టాచార్య నుంచి ఎలాంటి లబ్ధి పొందలేదని, తన కుటుంబ వివరాలు తెలుసుకున్న వారందరూ తనకు వీఐపీ గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. ఆమె ఫుట్ పాత్ పై జీవిస్తున్న విషయం తెలుసుకున్న అధికారులు ఆమెను వెంటనే అంబులెన్స్ లో కలకత్తాకు తీసుకెళ్లారు. ప్రభుత్వమే ఆమె బాగోగులు చూసుకునే అవకాశం ఉంది.  

Leave a Comment