మంటగలసిన మానవత్వం : రాత్రంతా వర్షంలో కూర్చోబెట్టారు..

కరోనా వైరస్ రావడంతో ప్రజల్లో మానవత్వాలు మంటగలుస్తున్నాయి. అందుకు అద్దం పట్టే సంఘటన తూర్పుగోదావరి జిల్లా కడియపు లంకలో జరిగింది. కడియపు లంకలో పనిచేస్తున్న ఏఎన్ఎం భర్తుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో బొమ్మూరు క్వారంటైన్ కు పంపించారు. అయితే విధులు ముగించుకుని తన స్వంత ఇంటికి వచ్చిన ఆమెను ఇంట్లోకి వెళ్లనీయకుండా ఇంటికి తాళం వేశారు. తమకు కూడా కరోనా సోకుతుందనే భయంతో గ్రామస్థులు ఆమెను అడ్డుకున్నారు.  ఆమెను రాత్రంతా వర్షంలోనే కూర్చోబెట్టారు. అధికారులు తనను ఆదుకోవాలని ఆ మహిళ ఓ సెల్ఫీ వీడియోలో వేడుకుంటోంది. 

 

Leave a Comment