పంది గుండె అమర్చిన వ్యక్తి చనిపోయాడు..!

మనిషికి పంది గుండె.. అమెరికాలోని మేరీల్యాండ్ ఆస్పత్రిలో గుండె మర్పిడి జరిగింది. ఇది అప్పుడు ఓ సంచలనం.. వైద్యులు కూడా ఈ శస్త్రచికిత్స ఓ కీలకమైన ముందడుగుగా భావించారు.. కానీ సరిగ్గా రెండు నెలలు తిరిగే సరికి గుండె మార్పిడి జరిగిన వ్యక్తి చనిపోయాడు.. కొద్ది రోజులుగా అతడి ఆరోగ్యం క్షీణించిందని, మంగళవారం మరణించాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.. అయితే అతడి మరణానికి కచ్చితమైన కారణాన్ని చెప్పలేదు.

ఈ ఏడాది జనవరి 7న డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి అమెరికాలోని మేరీల్యాండ్ ఆస్పత్రి వైద్యులు గుండె మార్పిడి చకిత్స చేశారు. బెన్నెట్ కి పంది గుండెను అమర్చారు. జన్యుమార్పిడి జరిగిన పంది గుండెను దాదాపు 8 గంటల పాటు కష్టపడి మార్పిడి చేశారు. వివిధ రుగ్మతలతో చావుకు దగ్గరగా ఉన్న బెన్నెట్ ని బతికించేందుకు ఆస్పత్రి వైద్యులు ప్రయత్నించారు. రెండు నెలల తర్వాత డేవిడ్ బెన్నెట్ తుదిశ్వాస విడిచాడు.

 

Leave a Comment