ఇంటర్ విద్యార్థితో మహిళా లెక్చరర్.. ప్రేమ.. పారిపోయి పెళ్లి..!

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ మహిళా టీచర్ ప్రేమ పాఠాలు చెప్పింది. మైనర్ అబ్బాయితో పారిపోయి పెళ్లి చేసుకుంది. చివరికి పోలీసుల చేతికి చిక్కి అరెస్ట్ అయ్యింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల మేరకు తురైయూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థి ఈనెల 5 నుంచి కనిపించకుండా పోయాడు. 

దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థి మిస్ అయిన రోజు అదే కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్ 26 ఏళ్ల షర్మిల కూడా కనిపించకుండా పోయింది. 

దీంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఆమె ఇంటికి వెళ్లి ఆరా తీశారు. ఈక్రమంలో షర్మిల తల్లి.. తన కూతురు ఓ విద్యార్థితో ఫోన్ లో మాట్లాడుతూ ఉండేదని చెప్పింది. షర్మిల ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారి ఆచూకీ తెలుసుకున్నారు. వారు పుత్తూర్ లో ఉన్నట్లు కనిపెట్టారు. అక్కడికి వెళ్లగా.. వారిద్దరూ తాంజావూర్ లోని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారని, షర్మిల ఫ్రెండ్ ఇంట్లో కాపురం పెట్టారని పోలీసులు గుర్తించారు. మైనర్ ని పెళ్లి చేసుకున్న షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.  

    

Leave a Comment