కడప జిల్లాలో పరువు హత్య.. పెళ్లయిన కూతురును చంపిన తండ్రి..!

తన పరువు పోతుందని ఓ తండ్రి కన్న కూతురును హతమార్చాడు. ఈ ఘటన కడప జిల్లా వేంపల్లెలో జరిగింది. పట్టణంలోని గాండ్ల వీధిలో నివాసం ఉంటున్న పోరుమామిళ్ల వనజారాణి(29)కి గురువేంద్రతో 2009లో పెళ్లి జరిగింది. వీరికి ఒక కూతురు ఉంది. కూతురు మూడో తరగతి చదువుతోంది. గురువేంద్ర ఉద్యోగ రీత్యా దుబాయ్ వెళ్లాడు. 

ఈక్రమంలో వనజారాణి ప్రొద్దుటూరులో ఉంటూ మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఈ ఏడాది జనవరిలో ఆమె భర్త గురువేంద్ర వేంపల్లెకు వచ్చాడు. అప్పటి నుంచి తనకు విడాకులు కావాలని, మరొకరిని పెళ్లి చేసుకుంటానని భర్తకు చెప్పింది. దీంతో గత కొద్ద రోజులుగా వారి మధ్య గొడవులు జరుగుతున్నాయి.  గురువేంద్ర ఈ విషయాన్ని వనజారాణి తల్లిదండ్రులకు చెప్పాడు.

దీంతో ఈ శనివారం ఆమె తండ్రి రాజశేఖర్, చిన్నాన్న జనార్ధన్, మరొకరు ఆమెకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. ఎంత నచ్చచెప్పినా ఆమె వినిపించుకోలేదు. దీంతో కోపోద్రిక్తుడైన తండ్రి రాజశేఖర్ చున్నీని మెడకు చుట్టి ఆమెను హత్య చేశాడు. పోలీసులు రాజశేఖర్, జనార్ధన్, మరొకరిపై కేసు నమోదు చేశారు.  

Leave a Comment