రెండో పెళ్లి చేయాలని కరెంట్ పోల్ ఎక్కిన 60 ఏళ్ల వృద్ధుడు..!

తనకు రెండో పెళ్లి చేయాలని 60 ఏళ్ల వృద్ధుడు కరెంట్ స్తంభం ఎక్కాడు. లేకపోతే కరెంట్ వైర్లు పట్టుకుని చచ్చిపోతానని బెదిరించాడు. ఈ ఘటన రాజస్తాన్ లో చోటుచేసుకుంది. రాజస్తాన్ లోని ధోల్ పూర్ కి చెందిన 60 ఏళ్ల సోబ్రన్ సింగ్ భార్య నాలుగేళ్ల క్రితం చనిపోయింది. 

సోబ్రన్ సింగ్ కు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారందరికీ వివాహాలు జరిగిపోయాయి. ఎంత మంది ఉన్న భార్య తోడు లేకపోవడంతో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. దీంతో సోబ్రన్ సింగ్ రెండో పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పాడు. అయితే రెండో పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. 

ఈ విషయంపై సోబ్రన్ సింగ్, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈక్రమంలో ఈ ఆగ్రహానికి గురైన సోబ్రన్ కరెంట్ స్తంభం ఎక్కాడు. కుటుంబ సభ్యులు కిందకు దిగాలని బుజ్జగించినా వినలేదు. పెళ్లి చేయకపోతే కరెంట్ వైర్లు పట్టుకుని చచ్చిపోతానని బెదిరించాడు. దీంతో కుటుంబ సభ్యులు సబ్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. వారు కరెంట్ సరఫరాను నిలిపివేశారు. కుటుంబ సభ్యులు చివరకు బతిమాలడంతో కిందకు దిగాడు.   

 

Leave a Comment