మీకు ఓ ఛాలెంజ్.. 20 నిమిషాల్లో ఈ రోల్ తినండి రూ.20 వేలు గెలవండి..!

మీరు భోజన ప్రియులా.. అయితే మీకోసం ఓ ఛాలెంజ్ ఉంది. మీరు ఆ ఆహారాన్ని తింటే రూ.20 వేలు గెలుచుకోవచ్చు.. ఎక్కడ అనుకుంటున్నారా.. ఢిల్లీలోని మోడల్ టౌన్ లో ఉన్న పాట్నా రోల్ సెంటర్ అనే ఫుడ్ కోర్టులో.. 10 కేజీల భారీ కతి రోల్ ని 20 నిమిషాల్లో తింటే రూ.20 వేల నగదు బహుమతిని అందజేస్తామని ఆ ఫుడ్ కోర్ట్ యజమాని ఛాలెంజ్ విసిరాడు.. 

ది ఫుడ్ కల్ట్ అనే ఫుడ్ బ్లాగర్ ఇన్ స్టాగ్రామ్ లో ఈ భారీ కతి రోల్ తయారీ వీడియోను షేర్ చేశారు. ఈ 10 కేజీల రోల్ పూర్తి చేయాలంటే ఒక సవాలే.. ఎందుకంటే ఈ రోల్ కోసం గోధుమ పిండితో ఒక పెద్ద చపాతీని తయారు చేశాడు. ఆ చపాతిలో మొత్తం 30 కోడిగుడ్లను వేయడంతో పాటు మసాలా సాస్ లు, నూడుల్స్, కబాబ్, పన్నీర్ మరియు సోయా చాప్ తో నింపాడు. ఈ ఫల్లింగ్ ఆధారంగా ఈ రోల్ ధర దాదాపు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఉంటుంది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని ‘బాహుబలి రోల్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  

Leave a Comment