పదో తరగతి పరీక్షల షెడ్యూల్ పై వదంతులు నమ్మొద్దు..

తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు పెడతాం

పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు

రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ఇంకా విడుదల చేయలేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు ప్రకటించారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల అనధికార షెడ్యూలును సామాజిక మాధ్యమాల్లో ప్రచారం  చేస్తున్నవారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చిరించారు. ఇటీవల మే 15వ తేదీ నుంచి పరీక్షలంటూ ప్రచారం చేసి విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యేలా కొంతమంది వదంతులు సృష్టించారన్నారు. ఈసారి వదంతులతో ఆగకుండా కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి, మే 18 నుంచి మే 25 వరకు పదో తరగతి పరీక్షలంటూ షెడ్యూలును వాట్సప్ లో విస్తృత ప్రచారం చేస్తున్నారని విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. నిందితులపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఒత్తిడికి గురికావొద్దని విద్యాశాఖ కమిషనర్ కోరారు.

Leave a Comment