రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1980కు చేరింది. ఇప్పటి వరకు 45 మంది మరణించారు. ప్రస్తుతం 1010 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకుని 925 మంది డిశ్చార్జ్ అయ్యారు.
గత 24 గంటల్లో కర్నూలు 13, చిత్తూరు 16, విశాఖ 1, అనంతపురం 5, గుంటూరు జిల్లా 6, కృష్ణా జిల్లా 1, నెల్లూరు 5, కడప 1, ప్రకాశం 2 కేసులు నమోదయ్యాయి. 8,666 శాంపిల్స్ పరీక్షించగా 50 మంది కరోనా పాజిటి్ గా నిర్ధారించబడ్డారు. ఇక కర్నూలు జిల్లాలో అత్యధికంగా 566 కరోనా కేసులు ఉన్నాయి.
జిల్లాల వారీగా కరోనా కేసుల సంఖ్య..
జిల్లా పేరు | కరోనా కేసుల సంఖ్య | |
కర్నూలు | 566 | |
గుంటూరు | 382 | |
క్రిష్ణా | 339 | |
అనంతరపురం | 107 | |
చిత్తూరు | 112 | |
కడప | 97 | |
నెల్లూరు | 101 | |
పశ్చిమ గోదావరి | 68 | |
విశాఖపట్నం | 63 | |
ప్రకాశం | 63 | |
తూర్పుగోదావరి | 46 | |
శ్రీకాకుళం | 5 | |
విజయనగరం | 4 | |
ఇతరులు | 27 | |
మొత్తం | 1980 |