ఏపీలో కొత్తగా 50 కరోనా కేసులు

రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1980కు చేరింది. ఇప్పటి వరకు 45 మంది మరణించారు. ప్రస్తుతం 1010 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకుని 925 మంది డిశ్చార్జ్ అయ్యారు. 

గత 24 గంటల్లో కర్నూలు 13, చిత్తూరు 16, విశాఖ 1, అనంతపురం 5, గుంటూరు జిల్లా 6, కృష్ణా జిల్లా 1, నెల్లూరు 5, కడప 1, ప్రకాశం 2 కేసులు నమోదయ్యాయి. 8,666 శాంపిల్స్ పరీక్షించగా 50 మంది కరోనా పాజిటి్ గా నిర్ధారించబడ్డారు. ఇక కర్నూలు జిల్లాలో అత్యధికంగా 566 కరోనా కేసులు ఉన్నాయి. 

జిల్లాల వారీగా కరోనా కేసుల సంఖ్య..

 

జిల్లా పేరుకరోనా కేసుల సంఖ్య
కర్నూలు566
గుంటూరు382
క్రిష్ణా339
అనంతరపురం107
చిత్తూరు112
కడప97
నెల్లూరు101
పశ్చిమ గోదావరి68
విశాఖపట్నం63
ప్రకాశం63
తూర్పుగోదావరి46
శ్రీకాకుళం5
విజయనగరం4
ఇతరులు27
మొత్తం 1980

 

 

Leave a Comment