ఉద్యోగులు అక్రమార్కులకు సహకరించవద్దు 

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మరియు వాణిజ్య పన్నుల శాఖా మంత్రి నారాయణస్వామి

లాక్ డౌన్ సమయంలో ఉద్యోగులు అక్రమార్కులకు సహకరించవద్దని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మరియు వాణిజ్య పన్నుల శాఖా మంత్రి కె. నారాయణస్వామి అధికారులను హెచ్చరించారు. అన్ని జిల్లాల ఎక్సైజ్ శాఖాధికారులతో ఉపముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ కొన్ని చోట్ల మద్యం అక్రమాలలో ప్రమేయం ఉన్న ఎక్సైజ్ శాఖ  అధికారులను సస్పెండ్ చేశామని తెలిపారు. శాఖాపరమైన విచారణ చేసి తొలగించడానికి వెనకాడబోమని హెచ్చరించారు. లాక్ డౌన్ సమయంలో మద్య నిషేధం అమలు చేయడం వలన భవిష్యత్తులో మద్యపాన నిషేధం అమలుపరచేందుకు అవకాశం ఉంటుందన్నారు. కాబట్టి ఎక్సైజ్ అధికారులంతా నిబద్దత తో పనిచేయాలన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో అన్ని బార్లలో స్టాక్ ఇన్స్పెక్షన్ చేయాలన్నారు. మద్యం అక్రమాల వెనుక ఉన్నవారి పై  పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలన్నారు. లాక్ డౌన్ కాలంలో నిత్యావసరాలకు ఇబ్బందులు పడకూడదని డిపోల్లో పని చేసే హమాలీ లకు రూ. 5 వేలు అడ్వాన్సు ఇస్తున్నామన్నారు. ఐడీ, ఎన్డీపీఎల్ అక్రమాలలో ఉన్న వారికి ప్రభుత్వ పథకాలను నిపివేసే ఆలోచన కూడా చేస్తామని హెచ్చరించారు.

 

Leave a Comment